– ఏసీబీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో కోహెడ మండల కేంద్రంలో కవాతు
నవతెలంగాణ- కోహెడ :
కోహెడ మండల కేంద్రంలోని తహాశీల్దార్ కార్యాలయం నుండి ప్రధాన వీధులగుండా కేంద్ర బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలవేళ కేంద్ర బలగాలతో కలిసి పోలీస్ బలగాలు ప్రజలకు భరోసా కల్పిస్తూ కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రజలకు భరోసా కల్పిస్తూ పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల ముందు ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ కేంద్ర రాష్ట్ర బలగాలను వినియోగించుకొని శాంతి భద్రతలను కాపాడుటకు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వాసాల సతీష్, సీఐ కిరణ్, ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్లు, తదితరులు పాల్గొన్నారు.