ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నవతెలంగాణ- రంగారెడ్డి : ప్రాంతీయ ప్రతినిధి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

Spread the love