ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నిక నేపథ్యంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ అభ్యర్థుల కోసం ముఖ్యనేతల సుడిగాలి పర్యటనలు కొనసాగాయి. ఈ మూడు జిల్లాల్లోని 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.   పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసి పలు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల నుంచి తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్‌ రెడ్డి, బీజేపీ పార్టీ తరఫున ప్రేమేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరఫున తీన్మార్‌ మల్లన్న బరిలో ఉన్నారు.

Spread the love