పోస్టల్ బ్యాలెట్ కు నేటితో గడువు ముగింపు: కలెక్టర్

– ఓటర్ పేసిలిటేషన్ సెంటర్ ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్  రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్ వెంకట్రావు ,ఆదనపు కలేక్టర్ సిహేచ్ ప్రియాంక తో కలసి గురువారం సందర్శించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ బుధవారం నుండి గురువారం వరకు రెండు రోజులలో 182 మంది పోలింగ్ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు ని వినియోగించుకున్నారని, నేడు చివరి రోజు కాబట్టి ఉదయం :8:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కలెక్టరేట్ లోని ఓటర్ పేసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ పట్టభద్రుల ఓటు హక్కు ని వినియోగించుకోవాలని తెలిపారు.
Spread the love