– అమిత్ చక్రవర్తికి కూడా..
న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఒక కేసులో అరెస్టయిన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ కోర్టు నవంబర్ 2 వరకు పోలీసు కస్టడీకి పంపింది. న్యూస్క్లిక్కు సంబంధించిన పలువురు జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడి చేసిన తర్వాత అక్టోబర్ 3న పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేసిన విషయం విదితమే. నగర న్యాయస్థానం వారిని మొదట ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. తర్వాత జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 25 వరకు పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వారిని పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ ముందు హాజరుపరిచారు.
ప్రబీర్ పుర్కాయస్థకు వచ్చేనెల 2 వరకు పోలీసు కస్టడీ
4:09 am