తహశీల్దార్ కు సీఎం రేవంత్ చిత్రపటం బహుకరణ


నవతెలంగాణ – చిన్నకోడూరు: ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని విధిగా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు విన్నవించినా కార్యరూపం దాల్చడం లేదని, దీంతో తామే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మొదటగా చిన్నకోడూరు మండల ఎమ్మార్వో కార్యాలయంలో తహశీల్దార్ జయలక్ష్మికి సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గొడుగు దిలీప్ కుమార్ ఫోటో బహుకరించినట్లు తెలిపారు. ఇకనైనా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గుడుమల్ల మల్లేశం, చౌడారం గ్రామ శాఖ అధ్యక్షుడు జెడల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Spread the love