రాంపూర్ ఉపాధ్యాయునికి ప్రధాని అభినందనలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న శ్రీనివాస్ ఖత్రి కి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి నుండి అభినందనపత్రం లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. గతంలో ప్రధాని చేపట్టిన పరీక్షాపే చర్చ కార్యక్రమం ఆన్లైన్ లో జరిగినపుడు శ్రీనివాస్ ఖత్రి చైతన్యవంతంగా పాల్గొని నిర్మాణాత్మక సలహాలను అందించడం వలన ప్రధాని కార్యాలయం నుండి అభినందనపత్రం గురువారం నాడు పోస్టులో అందిందని , వారికి ఆ పత్రం అందించి పాఠశాల అద్యపకులందరు అభినందించినట్లు తెలిపారు.
Spread the love