ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరుగుతున్న వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Spread the love