గ్రూప్-3 అభ్యుర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ గ్రూప్-3 పరీక్షలకు రెడీ అవుతున్న అభ్యర్థులకు ఓ అలర్ట్. గ్రూప్-3 పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థుల వివరాల్లో తప్పులు, పొరపాట్లు సరిచేసుకునేందుకు వీలుగా టీఎస్‌పీఎస్సీ ఎడిట్ అవకాశాన్ని కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 21తేదీ సాయంత్రం వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవచ్చు. మరోవైపు, పశు సంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్-ఏ, బీ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు కీని, అభ్యర్థుల సమాధానాల పత్రాలను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటల వరకూ ఇవి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Spread the love