భూకక్ష నుండి చంద్రుడి కక్షలోకి..చంద్రయాన్-3లో కీలక ఘట్టం

నవతెలంగాణ – హైదరాబాద్
ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష్య నుండి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. సరిగ్గా శనివారం రాత్రి గం.7.15 సమయానికి చంద్రుడి కక్షలోకి వెళ్లింది. ఈ కక్ష్యలో చంద్రయాన్-3 పద్దెనిమిది రోజుల పాటు తిరగనుంది. ఆగస్ట్ 23 లేదా 24న దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తి చేసుకుంది. ఇక నుండి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుండి దీనిని చేపట్టింది. ఈ వ్యోమ నౌక తన ప్రయాణంలో మూడింట రెండొంతులను పూర్తి చేసింది.

Spread the love