నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇప్పటికే ఫేస్బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు ‘ఎక్స్’ (ట్విటర్) లోకి ఎంట్రీ ఇచ్చారు. @KCRBRSpresident పేరిట కేసీఆర్ తన ట్విటర్ ఖాతా తెరిచారు. మాజీ మంత్రి, తన తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఖాతాను అనుసరించడం చేస్తున్నాయి. అటు ఇన్స్టాగ్రాంలో కూడా కేసీఆర్ తన ఖాతాను తెరిచారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి.. నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారనే దాని కోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.