రెండు దశల్లోనూ బీజేపీ కనుమరుగైంది: అఖిలేష్ యాదవ్

నవతెలంగాణ – హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా ఉందని ఆరోపించారు. మొదటి, రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని తెలిపారు. బీజేపీ ఓటర్లను పొందడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలంగా ఉందని తెలిపారు. బీజేపీని విడిపించుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం ఈ రెండు అంశాలే బీజేపీపై ప్రభావం చూపుతాయని తెలిపారు. బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని వివరించారు.

Spread the love