రేపు హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో జరగనున్న ఓ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరుకానున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై రచించిన మూడు పుస్తకాలను పీఎం మోడీ విడుదల చేయనున్నారని తెలిసింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ సందర్భంగా ది హిందూ హైదరాబాద్ ఎడిషన్ మాజీ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నగేష్ కుమార్ రచించిన “వెంకయ్య నాయుడు – లైఫ్ ఇన్ సర్వీస్”, వెంకయ్య నాయుడు మాజీ కార్యదర్శి సంకలనం చేసిన ‘సెలబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఎం.వెంకయ్య నాయుడు యాస్ ఏ 13 వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’, సంజయ్ కిషోర్ రచించిన “మహానేత – లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు’ పుస్తకాలను విడుదల చేయనున్నారు.

Spread the love