నేడు రామోజీరావు అంత్యక్రియలు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు సీఎంలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పటిష్ఠ భద్రత కల్పించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. కాగా ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు హాజరై నివాళులర్పించనున్నారు.

Spread the love