సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే: జూ.ఎన్టీఆర్ ట్వీట్

నవతెలంగాణ  – హైదరాబాద్: ఈనాడు అధినేత రామోజీరావు (88) శనివారం ఉదయం ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.

Spread the love