నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఐసీసీ రూల్ అతిక్రమించాడు. దీంతో అతనిపై ఐసీసీ అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ ను ఇచ్చారు. మంగళవారం(జూన్ 25) సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సహచర ఆటగాడు కరీం జనత్ పై దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ అతనికి ఈ శిక్ష విధించింది. అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడిపై ప్రమాదకరమైన రీతిలో బంతిని లేదా ఏదైనా క్రికెట్ పరికరాలను విసిరితే అది ఆర్టికల్ 2.9 కింద నేరంగా పరిగణించబడుతుంది.