- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో శనివారం రేషన్ కార్డు ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఆ గ్రామ ఉపసర్పంచ్ ఎండి ఫారూఖ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డుతో రేషన్ కార్డుకు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు- ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే లబ్దిదారులకు రేషన్ బియ్యం నిలిపివేయడం జరుగుతుందని, కావను గ్రామస్తులు విధిగా ఈ కేవైసీని పూర్తి చేయాలని కోరారు.
- Advertisement -



