కాంగ్రేస్ ప్రభుత్వం లో యువతకు భరోసా

నవతెలంగాణ -పెదవూర: రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో యువతకు బరోసా పథకం ద్వారా నిరుద్యోగులకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి ఇస్తుందని నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. బుధవారం గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఈసందర్బంగ గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలతో, కోలాట విన్యాసాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జయవీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ లను 100రోజులలో అమలు చేస్తుందని, బిసి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అని అన్నారు. యువతకు బరోసా పథకం ద్వారా మొదటి ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది, నిరుద్యోగులకు ప్రతి నెల 4000 రూపాయల భృతి ఇస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love