నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతీయ దవాఖాన సిబ్బంది..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందిపై కొంతమంది విధులకు ఆటంకం కలిగించి వైద్యులపై దాడి చేసినందుకు నిరసన గా సోమవారం వేములవాడ ప్రాంతీయ దావాఖానాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  వైద్యులపై సజీవ దహనానికి ప్రయత్నం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్ ఇండెంట్ ఆర్ మహేష్ రావు, డాక్టర్లు తిరుపతి, సంతోష్ చారి, అనిల్ కుమార్, సుభాషిని ,  వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love