కాల్వ మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ – వలిగొండ రూరల్

మండలంలోని టేకులసోమారంకు చెందిన కాంగ్రెస్ నాయకులు చేగూరి మల్లేశం ఆధ్వర్యంలో పల్లె వంపు రైతులకు బునాదిగాని కాల్వ ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందడం లేదని, మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్  రెడ్డిని ఆయన  స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పందించి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సహకారంతో సాగు నీటి కాల్వలకు నిధులు మంజూరు చేయించి పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందించడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేఖల ప్రభాకర్, రేఖల బాల్ రాజు, యానాల అశోక్ రెడ్డి, పడమటి సత్తి రెడ్డి, మద్ది యాదిరెడ్డి, చేగూరి యాదయ్య, జంగయ్య, పరమేశ, మోహన్, గణేష్ రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love