విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి

నవతెలంగాణ – ఆర్మూర్  

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి చెందిన కత్రాజి గంగారం విశ్రాంత ఉపాధ్యాయుడు సోమవారం మృతి చెందారు. విశ్వబ్రాహ్మణ సంఘ భవన నిర్మాణం లోను ,పలు సేవా కార్యక్రమాల్లోనూ కీలకపాత్ర పోషించిన ఆయన మృతి తో పఠనంతో పాటు పెర్కిట్ ,మామిడిపల్లి ల ఎందు విషాద ఛాయలు అలముకున్నవి. పెర్కిట్ తిరుమల కాలనీ లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అంత్యక్రియలు తిరుమల కాలనీ యందు నిర్వహించినారు. పలువురు సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love