నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు. జగిత్యాల నుంచి నిజామాబాద్కు బయల్దేరిన కేసీఆర్ బస్సును మార్గమధ్యలో ఆపి తనిఖీ నిర్వహించారు. మరికాసేపట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బస్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.