చామలను గెలిపించుకునేందుకు చేయి గుర్తు పై ఓటెయ్యండి..

– చల్మెడ  జనమంతా చామలకే జై కొట్టు తున్నారు…
– కాంగ్రెస్ జిల్లా నాయకులు , మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేమిరెడ్డి జితేందర్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు చేయి గుర్తు పై ఓటు వేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు , మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వేమిరెడ్డి జితేందర్ రెడ్డి కోరారు. సోమవారం  చల్మడ గ్రామంలోని బోత్తలగూడెంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలవాలని భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి, మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపుమేరకు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి కళ్ళబొల్లు మాటలు చెపుతూ గారడి చేస్తున్న ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల స్వాగతిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అని అన్నారు. మహిళలాలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు,  కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది అని అన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న ప్రచారంలో చల్మడ ప్రజలంతా చలమలకే జై కొడుతున్నారని అన్నారు . ఈ కార్యక్రమంలో  బతరాజు సత్యం,  కొంక శంకర్, కొంక చంద్రయ్య, గుండెబోయిన నరసింహ  యాదవ్, రమేష్ యాదవ్, యాదయ్య యాదవ్, యాదయ్య ముదిరాజ్, బి లాలయ్య ముదిరాజ్, మల్లికార్జున్ గౌడ్, బాబు మాదిగ, బాతరాజు నర్సింహా, మహేష్ యాదవ్, గంగాదేవి స్వామి తదితరులు ఉన్నారు.
Spread the love