ఆరు గ్యారంటీలపై రేవంత్‌ తొలి సంతకం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు. రజనీకి అక్కడే ఉత్తర్వులను రేవంత్‌రెడ్డి అందజేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే:
మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.
యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Spread the love