Tuesday, May 12, 2026
E-PAPER
Homeక్రైమ్జహీరాబాద్ బార్డర్ లో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

జహీరాబాద్ బార్డర్ లో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

- Advertisement -

– నలుగురి పరిస్థితి విషమం
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై శంషల్లాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక బీదర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు న్యాల్ కల్ మండలానికి చెందిన వారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -