Monday, May 18, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

యూపీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీలోని బహ్రాయిచ్ జిల్లాలో, నాన్‌పారా-బహ్రాయిచ్ హైవేపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మటేరా ప్రాంతంలోని ధనోలి మలుపు సమీపంలో సుమారు 10:30 గంటలకు, బహ్రాయిచ్ వైపు వెళ్తున్న టాటా ప్యాచ్ కారు, పక్కదారి నుంచి వచ్చిన కంబైన్ హార్వెస్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ఇద్దరిని బహ్రాయిచ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -