ఆర్టీసీ బస్సు ఆటో “ఢీ”

– ఒకరు అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ – రాయపర్తి
ఆర్టీసీ బస్సు , ఆటో ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఎస్సై వడ్డే సందీప్ కుమార్ కథనం మేరకు మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గూడెల్లి శ్రీను (46) గ్రామం నుండి మేడారం వెళ్తున్న భక్తులను వర్ధన్నపేట ఆర్టీసీ బస్టాండ్ లో దిగిపెట్టి తిరుగు ప్రయాణమై స్వగ్రామానికి వెళ్తుండగా..సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి మీదుగా  తొర్రూర్  నుండి వరంగల్ వెళుతుండగా మండల కేంద్రం శివారులో బస్సు ముందు వెళ్తున్న గూడ్స్ ర్యాలీ ఆటోను ఓవర్టేక్ చేస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్ వైపు వస్తున్న ఆటో బస్సు వెనుక భాగాన ఢీకొట్టగా ఆటో రెండు భాగాలుగా విడిపోయింది. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య విజయ, కూతురు మౌనిక, కుమారుడు రాజు ఉన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు. బస్సు డ్రైవర్ బస్సును నిలుపకుండా వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యలో బస్సును పట్టుకున్నట్లు సమాచారం.
Spread the love