మహిళలకు ఆర్టీసీ మరో శుభవార్త..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉచిత బస్సు పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఇక నుంచి బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బహుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అనేకం అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రధాన ఎన్నికల హామీలలో ఒకటి.  కాగా తాజాగా డీలక్స్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు పారితోషికం అందించేందుకు కొత్త పథకం ప్రారంభమైంది. మహిళలు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కాకుండా డీలక్స్‌ బస్సుల్లో టిక్కెట్లు కొంటే 15 రోజుల పాటు బహుమతి Gift గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా హనుమకొండ-హైదరాబాద్ రూట్లో 3 డీలక్స్ బస్సులను జనగామ డిపో ప్రవేశపెట్టింది.

Spread the love