ప్రయాణికులకు శుభవార్త చెప్పిన సజ్జనార్

నవతెలంగాణ- హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించామన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Spread the love