ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు..

– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీని వాస్ రెడ్డి.. 
నవతెలంగాణ-తొగుట 
పెద్దమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీని వాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మండ లంలోని తుక్కా పూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లా డుతూ గ్రామంలో గల ముదిరాజ్ ల కుల దైవం పెద్దమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మా ణం కోసం సహకరించా లని కోరారు. ప్రహరీ గోడ  నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశామ న్నారు. శ్రీనివాస్ రెడ్డి స్పందించి పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలి పారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ రెడ్డికి ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు అక్కం స్వామి, తుక్కాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లెంగల సాయు కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయ కులు లింగాల కృష్ణ, వెంకటి, ఉప్పలయ్య, స్వామి గ్రామ పార్టీ అధ్యక్షుడు బర్రెంకల స్వామి, చిక్కుడు స్వామి, చిక్కుడు భాస్కర్, మాష్టీ యాదయ్య, ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love