
మండలంలోని దుబ్బపేట శివారు, చిన్నతూండ్ల గ్రామం పంట పొలాల్లో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలు దుబ్బు జాతరకు ముస్తామయ్యాయి. రెండు వందల సంవత్సరాలుగా కాకతీయుల సుమారు రెండు వందల సంవత్సరాలుగా జాతరను చిన్నతూండ్ల గ్రామానికి చెందిన గౌడ కులానికి చెందిన వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి చైర్మన్ గా కోట లక్ష్మయ్య గౌడ్ ఉన్నారు. ఆయన నేతృత్వంలో అమ్మవార్ల గద్దెలు రంగురుగులతో ముస్తాబయ్యాయి. సందర్శకులకు మంచినీటి, మరుగుదొడ్లు, స్నానపు గట్లు తదితర సౌకర్యాలు ఎండోమెంట్ నుంచి మంజూరైన నిధులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి మూడేళ్లకొక్కసారి మేడారం మహజాతర ఉత్సవాలు పురస్కరించుకుని దుబ్బ జాతర ఉత్సవాలు నిర్వహించునట్లుగా తెలిపారు. ఈ నెల 21, 22, 23 మూడు రోజులపాటు జాతర వేడుకలు ఘనంగా నిర్వహించునట్లుగా నిర్వాహకులు, చైర్మన్ లక్ష్మయ్య తెలిపారు. ఈ జాతర ఉత్సవాలకు మండలంలోని తాడిచెర్ల, చిన్నతూoడ్ల,పెద్దతూoడ్ల, మల్లారం,కొయ్యుర్ గ్రామాల నుంచే కాకుండా భూపాలపల్లి, కాటారం పట్టణాల నుంచి వేలాదిమంది సందర్శకులు తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు.