5 సంవత్సరాల ప్రగతి నివేదికను సమర్పించిన: సర్పంచ్

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి, పెద్దకొండూరు, మందోల్లగూడెం గ్రామాలలో సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో సన్మాన సభలు నిర్వహించారు. 5 సంవత్సరాల పాటు సాధించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బాతరాజు సత్యం, రమేష్ గౌడ్, బూరుగు విజయలక్ష్మి కృష్ణారెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బోయ ఇందిర,బద్దం కొండల్ రెడ్డి, వెంకటేశం ఉప సర్పంచ్లు బోయ లింగస్వామి, ప్రకాశ్ రెడ్డి నాయకులు బిక్షంగౌడ్, జేజే రెడ్డి మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

Spread the love