బాదిత కుటుంబానికి ఎస్భిఐ బ్యాంక్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

నవతెలంగాణ – ఏర్గట్ల
ఉప్లూర్ గ్రామానికి చెందిన డాకూరి చక్రవర్తి గతకొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. అతను గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్గట్ల బ్రాంచ్ లో ఎస్భిఐ జనరల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మరణించిన అతనికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావడంతో ఏర్గట్ల ఎస్భిఐ మేనేజర్ సి.హెచ్. రాము చేతుల మీదుగా నామిని అయిన డాకూరి లతకు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రాము మాట్లాడుతూ…ప్రభుత్వ పథకాలను అర్హులు ఉపయోగించుకోవాలని,బాధిత కుటుంబానికి ఎస్భిఐ అండగా నిలవడం ఆనందగా ఉందని అన్నారు.ఇందులోభాగంగా సర్వీస్ మేనేజర్ ఎం.ధర్మపురి,ఏరియా బీడీఎం శ్రీధర్,బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love