సేవ కార్యక్రమాలు సంతృప్తిని ఇస్తాయి: ఎంపీటీసీ

నవతెలంగాణ – ఆర్మూర్ 

గత కొన్ని సంవత్సరాల నుండి ఎంపీటీసీగా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం సంతృప్తిని ఇచ్చిందని మండలంలోని చేపూర్ గ్రామ ఎంపీటీసీ బాల్ నరసయ్య అన్నారు. మరి కొద్ది రోజుల్లో పదవి కాలం ముగిస్తుండడంతో  నవతెలంగాణ తో మాట్లాడినారు. గ్రామంలోని పలు కుల సంఘ భవనాలకు రిగ్గులు వేయించినట్టు, నాయకపోడు, మాదిగ, గుండ్ల మహిళా భవనం తదితర వాటికి కుర్చీలను వితరణ చేసినట్టు, గ్రామాల్లో నెలకొల్పిన సరస్వతి, దుర్గామాత, శివాజీ తదితర విగ్రహాల ఏర్పాటులోనూ సహకారం అందించినట్టు, కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి సహాయం చేసినట్టు తెలిపారు.
Spread the love