పరిణితి చెందిన నేత శంకరయ్య


– మాజీ మంత్రి ఈటల రాజేందర్
నవతెలంగాణ జమ్మికుంట: జమ్మికుంట మాజీ ఉపసర్పంచ్ మాజీ కౌన్సిలర్ , బీజేపీ సీనియర్ నేత పొనగంటి శంకరయ్య పరిణితి చెందిన నేత అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం పొనగంటి శంకరయ్య దశ దిన కర్మ సందర్భంగా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన సంతాప సభ లో ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై లోతైన అవగాహన కలిగి పరిష్కారం కోసం తపించేవారన్నారు. తాను బిజేపి లో చేరిన తర్వాత అతనితో విడదీయరాని బంధం ఏర్పడింది అన్నారు. పేదలకు తాను చేసే సహాయ సహకారాల్లో శంకరయ్యను ముందుంచి కొనసాగించానని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. శంకరయ్య మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేవారని, అందరితో కలివిడిగా, సౌమ్యంగా ఉండే వారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి సంపత్ రావు, జీడి మల్లేష్, ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, మాడ గౌతంరెడ్డి, పుప్పాల రఘు, సింగిరెడ్డితిరుపతి రెడ్డి, సంపెల్లి సంపత్ రావు, మాటల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love