– గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రక్షిత, సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ రెడ్క్రాస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర, జిల్లాల బాధ్యులతో ఆమె వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారి కోసం హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.