- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. రెండవ వారం చివరకు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది రుతుపవన సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాల సగటులో 92 శాతంగా ఉంటుందని ఐఎండీ ఇంతకు ముందటి అంచనాల్లో పేర్కొంది.
- Advertisement -



