- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. గత ఐదు మ్యాచ్లలో మూడు ఓడిన రాజస్థాన్కు ఇది కీలక పోరు. ఇవాళ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు బలపడతాయి. లేకపోతే మిగిలిన మ్యాచ్లపై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు వరుస విజయాలతో జోరులో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో గెలిచి టాప్-4లో స్థానం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
- Advertisement -



