పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

నవతెలంగాణ-సారంగాపూర్‌
నర్సాపూర్‌(జి) పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలన్నారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక, సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం రిసెప్షన్‌, టెక్నికల్‌ రూమ్‌లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హనుమండ్లు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love