గంజాయి సరఫరా, వినియోగం నివారణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

– మల్టీ జోన్ ఒన్ ఐజీ ఏవీ రంగనాథ్
నవతెలంగాణ – అశ్వారావుపేట
గంజాయి సరఫరా,వినియోగం నివారణ పై పోలీస్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్టీ జోన్ ఒన్ ఐజీ ఏవీ రంగనాథ్ ఈ జోన్ పరిధిలోని అన్ని విభాగాల పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని స్థానిక సీఐ జితేందర్ రెడ్డి తెలిపారు.  అశ్వారావుపేట సరిహద్దు మండలంగా ఉన్నందున నిఘా పెంచుతున్నట్లు సీఐ తెలిపారు.అక్రమ సరఫరాలో పెట్టుబడి నా,వినియోగానికి పాల్పడుతూ దొరికి పోయినా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజానీకానికి హెచ్చరికలు జారీ చేసారు.
Spread the love