లండన్​కు ఎమ్మెల్సీ కవిత.. కీలక విషయలపై ప్రసంగం

నవతెలంగాణ- హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత లండన్​లో పర్యటిస్తున్నారు. బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే సమావేశంలో కీలకోపన్యాసం చేసేందుకు కవిత లండన్ వెళ్లారు. ఇవాళ ఆమె మహిళా రిజర్వేషన్ల అంశంపై మాట్లాడనున్నారు. లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్‌లో ఇవాళ మహిళా రిజర్వేషన్ చట్టం – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటం, రిజర్వేషన్ల వల్ల జరిగే మేలు, చట్టసభలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెంచడం, రాజకీయాల్లో మహిళల పాత్ర వంటి అంశాలపై కవిత ప్రసంగించనున్నారు.

Spread the love