నార్త్సౌండ్ : వెస్టిండీస్తో రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. టాప్ ఆర్డర్లో నిశాన్ మధుష్క (1), దినేశ్ చండిమాల్ (1) విఫలమైనా..ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 549 పరుగులు చేసింది. ఓపెనర్ లహిరు ఉదర (188, 248 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్లు), కమిందు మెండిస్ (84, 120 బంతుల్లో 11 ఫోర్లు), కుశాల్ మెండిస్ (69, 115 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు), సోనల దినుశ (92, 166 బంతుల్లో 12 ఫోర్లు) రాణించారు. 139.3 ఓవర్లలో 9 వికెట్లకు 549 పరుగులు చేసిన శ్రీలంక ఓ వికెట్ ఉండగానే ఇన్నింగ్స్ను డిక్లరేషన్ ఇచ్చింది. ఆతిథ్య వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 122/1తో ఎదురీదుతోంది. ఓపెనర్ జాన్ కాంప్బెల్ (72 నాటౌట్, 153 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. బ్రాండన్ కింగ్ (17) అవుటవగా.. కావెవ్ హోడ్జె (23 నాటౌట్)తో కలిసి కాంప్బెల్ అజేయంగా ఆడుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 427 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.
శ్రీలంక భారీ స్కోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


