శ్రీశైలంలో యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – అమరావతి: నంద్యాల జిల్లా శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయం చెంత ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మఠంగారి మహేష్‌ (26) అనే యువకుడు ఓ సత్రంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సత్రం సిబ్బంది తలుపులు తీయాలని కోరగా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో కిటికి నుంచి చూడగా యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు  అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కొంతకాలంగా శ్రీశైలం ఉపాలయాల్లో ఆ యువకుడు పాల్గొన్నాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే యువకుడి మృతికి ఇంకా వివరాలు తెలియరాలేదు.

Spread the love