నవ వధువు ఆత్మహత్య..!

నవతెలంగాణ- రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింపు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ తరుణంలో కవిత అనే యువతికి గత ఏడు నెలల కిందట కాటేదాన్‌కు చెందిన చంద్రశేఖర్‌తో పెండ్లి జరిగింది. కట్నం తేవాలని అత్తమామలతో పాటు భర్త మానసికంగా, శారీరకంగా వేధించేవారని కవిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.వీరితో పాటు ఆడపడుచు సూటిపోటి మాటలు అనడంతో వధువు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబం  సభ్యులు అన్నారు. కవిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త చంద్రశేఖర్‌తో పాటు అత్తామామలు, ఆడపడుచుపై 304(బీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.

Spread the love