సిబ్బందికి అస్వస్థత..ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ విమాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను రద్దు చేసింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 70 కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. సిబ్బంది అస్వస్థతకు గురికావడంతో విమానాలు రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఎయిరిండియా సంస్థలో 300 మందికి పైగా సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై సివిల్ ఏవియేషనల్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love