నవతెలంగాణ షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీలో స్కూల్ విద్యార్థినిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యార్థినిని ఈ ప్రమాదానికి గురైంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.