దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

Raghunandan Rao
Raghunandan Rao

నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు బయలుదేరిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గజ్వేల్ లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. దుబ్బాక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మధ్యలోనే అడ్డుకున్న‌ పోలీసులు.. అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రెండు రోజుల కిందట గజ్వేల్ లో శివాజీ విగ్రహంపై ఓ ముస్లిం వ్యక్తి ముత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో.. ముస్లింపై హిందు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముస్లింలు, హిందువుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇక ఇవాళ ఇదే సంఘటనపై హిందూ యువకుల ను పరామర్శించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లే ప్రయత్నం చేశారు.

Spread the love