నేడు కొమురం భీం, సిద్దిపేటలో సీఎం పర్యటన..

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ రెడ్డి కొమురం భీం, సిద్దిపేట జిల్లాలో జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో జన జాతర సభకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ కూడలిలో ప్రసంగించనున్నారు.

Spread the love