మరోసారి రన్​వే పైకి చిరుత..

నవతెలంగాణ – హైదరాబాద్ :  నాలుగు రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్​పోర్టు రన్ వే పైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్​వే సమీపంలో ఫారెస్ట్​ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ట్రాప్​కెమెరాలకు చిక్కాయి. గత ఆదివారం ఎయిర్​పోర్ట్​రన్​వే పై కనిపించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి జారుకుంది. ఆ తర్వాత రెండ్రోజులు జాడ లేదు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరోసారి రన్​వేపైకి వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్​బోను వద్ద కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాలు ట్రాప్​కెమెరాల్లో రికార్డ్​అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్​పోర్టు ఏరియాలో చిరుతపులి కోసం గాలింపు కొనసాగుతోంది.

Spread the love