నవతెలంగాణ – హైదరాబాద్ : నాలుగు రోజుల కింద కలకలం సృష్టించిన చిరుతపులి మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టు రన్ వే పైకి వచ్చింది. ఆ దృశ్యాలు రన్వే సమీపంలో ఫారెస్ట్ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ట్రాప్కెమెరాలకు చిక్కాయి. గత ఆదివారం ఎయిర్పోర్ట్రన్వే పై కనిపించిన చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి జారుకుంది. ఆ తర్వాత రెండ్రోజులు జాడ లేదు. మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరోసారి రన్వేపైకి వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్బోను వద్ద కొన్ని గంటల పాటు చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాలు ట్రాప్కెమెరాల్లో రికార్డ్అయ్యాయి. ప్రస్తుతం ఎయిర్పోర్టు ఏరియాలో చిరుతపులి కోసం గాలింపు కొనసాగుతోంది.