నవతెలంగాణ-అమరావతి: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలేనికి చెందిన ఎస్.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్కుమార్ లాడ్జిలో కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనుమానంతో తలుపులు పగలగొట్టిన లాడ్జి సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్కుమార్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా.. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అచ్యుతాపురం సీఐ మురళీరావు తెలిపారు.